PLD: చంద్రగ్రహణం కారణంగా పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. గ్రహణ ప్రభావంతో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు భక్తులకు దర్శనం ఉండదని అర్చకులు తెలిపారు. గ్రహణం వీడిన తర్వాత ఆలయ శుద్ధి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.