VZM : నేటి యువత భాషా సాహిత్యాలు అలవర్చుకోవాలని ప్రధాన వక్త మేడూరి సత్యనారాయణమూర్తి అన్నారు. గజపతినగరంలో లయన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో భాగవతంలోని రుక్మిణి కళ్యాణం అనే అంశంపై చైతన్య భారతి ఏర్పాటుచేసిన సభలో శుక్రవారం ప్రసంగించారు. సభకు చైతన్య భారతి అధ్యక్షులు బుద్ధరాజు వెంకట శ్రీరామ్ అధ్యక్షతన జరిగింది.