E.G: సీతానగరం మండలంలో జనగణన (Census) తొలి విడత శిక్షణ కార్యక్రమం శనివారంతో విజయవంతంగా ముగిసింది. తహసీల్దార్ (ఎంఆర్డీ) శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన శిక్షణలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. గణన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నమోదు ప్రక్రియపై సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.