W.G. తణుకు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్సకు సైతం ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం సహాయనిది అండగా ఉంటుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. సోమవారం టిడిపి కార్యాలయంలో సుమారు 40 మందికి సీఎం సహాయ నిధులు రూ. 24,29,807 మంజూరు కాగా, ఆ చెక్కులను లబ్ధిదారులకు అందించడమైనది. వారు చికిత్స తీసుకుని, త్వరగా కోలుకుని ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షించారు.