W.G: భీమవరం UTF కార్యాలయంలో సోమవారం CITU అనుబంధ శ్రామిక మహిళా రంగం జిల్లా సదస్సు జరిగింది. సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా ప్రభుత్వాలు ఎందుకు ఉత్తర్వులు ఇవ్వడం లేదని జిల్లా కన్వీనర్ కళ్యాణి ప్రశ్నించారు. పని ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులు, ఉద్యోగ భద్రత లేమి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని నేత చింతపల్లి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.