NTR: రైల్ పార్సిల్ యాప్ ద్వారా బుకింగ్, డెలివరీ సేవలను సులభతరం చేశామని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ బి.ప్రశాంత్ కుమార్ తెలిపారు. వినియోగదారుల సౌలభ్యం కోసం ఇంటింటికీ సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గత నెలలో విజయవాడ నుంచి 280 బుకింగ్లు నమోదయ్యాయని వెల్లడించారు. కస్టమర్లు ఈ యాప్ను వినియోగించుకోవాలని ఆయన కోరారు.