VZM: బొబ్బిలి పట్టణంలోని శ్వేతా షాపింగ్ కాంప్లెక్స్ వద్ద పైపులైన్ లీకుతో తాగునీరు వృథాగా పోతోంది. వేసవి కావడంతో తాగునీరు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి కొరతతో 3 రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. లీకులతో తాగునీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.