NLR: కంబాలదిన్నెలో మోపాడు రిజర్వాయర్ ఆధునీకరణ పనులను ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డిలు ప్రారంభించారు. రూ.32.40 కోట్లతో చేపట్టనున్న ఈ పనుల ద్వారా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 12,700 ఎకరాలకు పైగా సాగునీరు అందుతుంది. రైతులకు స్థిరమైన నీటి సరఫరా అందించడమే లక్ష్యమని వారు తెలిపారు. అనంతరం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.