కృష్ణా: జాతీయ సర్వే దినోత్సవ సందర్భంగా మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో కలెక్టర్ బాలాజీ నిన్న రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం ద్వారా మన శరీరంలో కొత్త రక్తం ఏర్పడి, ఉత్సాహంగా ఆరోగ్యకరంగా జీవిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ నవీన్ పాల్గొన్నారు.