E.G: ప్రపంచ యుద్ధాల ప్రభావంతో గ్యాస్ కొరత ఏర్పడిందని గోకవరం హోటల్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయాలని కోరుతూ సోమవారం తహసీల్దార్ రామకృష్ణకు వినతి పత్రం సమర్పించారు. గ్యాస్ నిలిపివేస్తే యజమానులతో పాటు కూలీలు రోడ్డున పడతారని వారు ఆవేదన చెందుతున్నారు. యుద్ధాల వల్ల సరఫరా దెబ్బతిందని, తక్షణమే స్పందించి ఆదుకోవాలని కోరారు.