SRPT: రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు. నడిగూడెం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఇవ్వాళ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యాప్ విధానాన్ని తొలగించి, పాత పద్ధతిలోనే రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.