TG: గవర్నర్ ప్రసంగం ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిదని భవిష్యత్ ప్రణాళికపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సభలో చర్చ పక్కదారి పట్టకుండా చూడాలని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు సమయం ఇవ్వలేదని.. భట్టి, జానారెడ్డికి కనీసం మైక్ ఇవ్వలేదని సీఎం గుర్తు చేశారు. సభా చర్చల్లో మహిళా సభ్యుల పాల్గొనాలన్నారు. పూర్తి స్థాయిలో అసెంబ్లీ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.