NTR: విజయవాడ ఏపీఏవోఎస్ అసోసియేషన్ హాల్లో కలెక్టర్ లక్ష్మీశ బుధవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో సాంప్రదాయ, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తే స్థిరమైన ఆదాయం పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.