AKP: ఉపాధి హామీ పథకాన్ని వేతనదారులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీవో నాగరాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం కోటవురట్ల మండలం కైలాసపట్నంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. రోజు తప్పనిసరిగా ముఖ ఆధారిత హాజరు నమోదు చేసుకోవాలన్నారు. అలాగే, కూలీల సంఖ్య తగ్గకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.