సత్యసాయి: CM చంద్రబాబు నాయుడును బుధవారం జిల్లా ప్రజాప్రతినిధులు కలిశారు. ఎంపీ బీకే పార్థసారథి, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతిలో సీఎంతో భేటీ అయ్యారు. జిల్లా అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఈ సందర్భంగా చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి వారికి దిశానిర్దేశం చేశారు.