NLR: బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం పరిధిలో ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగింది. నాయకులతో కలిసి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. నేడు నగదు అందని వారికి సోమవారం అందించనున్నారు. పట్టణ వ్యాప్తంగా నేడు 87 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.