కృష్ణా: గుడివాడ మండలం రామన్నపూడి గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు అడ్డుకున్న గ్రామస్థులపై జరిగిన దాడిని వైసీపీ నేతలు శనివారం తీవ్రంగా ఖండించారు. గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు జరపడమే కాకుండా, వాటిని ప్రశ్నించిన స్థానికులపై దాడులకు పాల్పడడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.