KRNL: ఆదోని తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో వాహనాలు నడిపిన నలుగురిపై కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. సోమవారం సీఐ నల్లప్ప మాట్లాడుతూ.. మొదటి అదనపు కోర్టులో హాజరుపరచగా, ఇద్దరికి ఏడు రోజులు, ఒకరికి పది రోజులు జైలు శిక్ష విధించారు. మరొకరికి రూ. 10 వేల జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.