అల్లూరి జిల్లా చింతపల్లి మండలం మేజర్ పంచాయతీ తాజంగిలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను స్థానిక సర్పంచ్ వంతల మహేశ్వరీ చేతుల మీదగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ జిల్లాలో యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈ టోర్నమెంట్ని నిర్వహించడం జరుగుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు.