చిత్తూరులో దొంగతనం కేసు ఛేదించారు. దుర్గానగర్ కాలనీలో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. వారి నుంచి రూ. 34 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు.