PLD: జిల్లాలో భూగర్భ జల మట్టాన్ని పెంచేందుకు రూ. 26.46 కోట్లతో జలధార-జల హారతి పనులకు కలెక్టర్ కృతిక శుక్లా ఆమోదం తెలిపారు. ఈ పనులు 274 సాగు నీటి సంఘాల ద్వారా చేపట్టనున్నారు. 227 చెరువుల్లో పూడిక తీత, కాల్వల పునరుద్ధరణతో భూగర్భ జల మట్టం 3 నుంచి 6 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల సాగు, తాగునీటి సమస్యలు తీరతాయని అధికారులు సూచించారు.