ATP: సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఈ నెల 20న నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని టీడీపీ నాయకుడు చౌలం మల్లికార్జున పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలోని ప్రజావేదికలో ఈ కార్యక్రమం జరగనుంది. రక్తదానం చేసే వారికి రూ.3 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.