CTR: వెదురుకుప్పం మండలం తార్లబైలు సర్వే నం.231లోని 98 ఎకరాల ప్రభుత్వ భూమిపై కబ్జా ప్రమాదం ఉందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే చర్యలు తీసుకుని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, పర్యవేక్షణ కట్టుదిట్టం చేశారు. ఆక్రమణకు యత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు త్వరగా స్పందించడంపై గ్రామస్థులు అభినందించారు.