విజయనగరం 43, 44వ డివిజన్ జనసేన యువ నాయకులు పతివాడ చంద్రశేఖర్ ఆదివారం డొక్కా సీతమ్మ మజ్జిగ పంపిణి, చలివేంద్రంను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిధిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి హాజరై, ఈ చలివేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహర్తికై ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.