PPM: గుమ్మలక్ష్మీపురంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం గ్రామ పెద్దలు, భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు, వేదమంత్రోచ్చారణల మధ్య ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వద్ద భక్తులతో సందడి నెలకొంది. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.