VZM: ప్రశాంత వాతావరణంలో గొల్లపల్లి దాడితల్లి పండుగ నిర్వహించుకోవాలని బొబ్బిలి సీఐ కె. నారాయణరావు కోరారు. బుధవారం సాయంత్రం స్థానిక రావువారివీధిలో గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పండుగ, సిరిమానోత్సవం ప్రశాంతంగా నిర్వహించాలని, అల్లర్లు, గొడవలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అల్లర్లు చేసి జీవితాలు నాశనం చేసుకోవద్దని కోరారు.