ప్రకాశం: వై. పాలెం నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ మాలపోలు శ్యామ్ ఆధ్వర్యంలో ఆదివారం 5 మండలాల కన్వీనర్ల సమావేశం జరిగింది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా సోషల్ మీడియా సభ్యులు పనిచేయాలని ఆయన సూచించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.