PPM: ఈనెల 24న సీతంపేట మండల కేంద్రంలో అన్న క్యాంటీన్ ప్రారంభానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. CM చంద్రబాబు వర్చువల్ ప్రారంభించనున్నారని నిర్వాహకులు బుధవారం తెలిపారు. ఈ మేరకు సీతంపేటలో శుక్రవారం నుంచి పేదలకు రూ.5కు భోజనం అందుబాటులోకి రానుంది. ఏరియా ఆసుపత్రి సమీపంలో అన్న క్యాంటీన్ ఉన్నందున రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.