W.G: బంగారం బదిలీ పేరుతో నరసాపురంలోని ఓ బ్యాంకు ఉద్యోగిని నమ్మించి నగదు కాజేసిన ముగ్గురిపై కేసు నమోదైంది. వేరే బ్యాంకులో గోల్డ్లోన్ ఉందని, నగదు ఇస్తే అక్కడ కట్టి విడిపించుకొని ఈ బ్యాంకులో పెడతామని సన్నీ, తబు, జరీనాలు రూ.1.70 లక్షలు జమ చేయించుకుని పరారయ్యారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు ప్రసాద్ ఫిర్యాదు చేయగా SI జయలక్ష్మి కేసు నమోదు చేశారు.