కృష్ణ: ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లి జడ్పీ హైస్కూల్లో రూ.31.16 లక్షలతో దాత వేగె లక్ష్మి శ్రీనివాసరావు నిర్మించిన అదనపు తరగతి గదులను MLA యార్లగడ్డ వెంకట్రావు బుధవారం రాత్రి ప్రారంభించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి లక్ష్యసాధన చేయాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.