PLD: నరసరావుపేట రోటరీ క్లబ్లో ఖరీఫ్ 2026-27కు ప్రత్తి, మిరప విత్తన సరఫరాపై సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా వ్యవసాయ అధికారి ఎం. జగ్గారావు అధ్యక్షతన కంపెనీలు తమ ప్రణాళికలను వివరించాయి. నాణ్యమైన విత్తనాలు సమయానికి రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.