ATP: రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలోని ప్రధాన రహదారులు, జాతీయ రహదారులపై విజిబుల్ పోలీసింగ్తో పాటు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. రాత్రి వేళల్లో ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసి అతివేగం, మద్యం సేవించి వాహనం నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.