NDL: బేతంచెర్ల సంజీవనగర్కు చెందిన వడ్డె సురేష్ (38) మద్యం సేవించడంపై భార్యతో జరిగిన గొడవతో మనస్తాపానికి గురై బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య, కూతురు ఉన్నారు. మృతుడి తమ్ముడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.