ELR: కొయ్యలగూడెం తారకరామ నగర్ అత్త పోల మంగమ్మను నరికి చంపిన అల్లుడు కేదారి పుల్లయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం అచ్యుతాపురం వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే అత్తని హత్య చేశాడని పోలీసులు వివరించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వివరించారు.