W.G: జిల్లాలో ఆస్తి పన్ను వసూళ్లలో తణుకు మున్సిపాలిటీ 81 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచిందని కమిషనర్ రామ్ కుమార్ తెలిపారు. మొత్తం రూ.16.46 కోట్లకు గాను రూ.13.34 కోట్లు వసూలయ్యాయని, పాలకొల్లు రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ కల్పిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.