KDP: అగ్రహారం గ్రామంలో హత్యకు గురైన కీర్తన కుటుంబాన్ని కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి సంఘటన వివరాలు తెలుసుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసు ఖర్చులు, చదువు కోసం రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తూ, కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దోషులను కఠినంగా శిక్షించాలని అధికారులను కోరారు.