ELR: బుట్టాయగూడెం మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న గుబ్బల మంగమ్మ ఆలయాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చి దిద్దడానికి కృషి చేస్తామని ఆలయ కమిటీ తెలిపింది. ఆలయ పరిసరాలను కమిటీతో పాటు అటవీ శాఖా అధికారులు పరిశీలించారు. అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వల్ల కలిగే కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. త్వరలోనే ఆహ్లాదకరమైన వాతావరణము ఏర్పాటు చేస్తామన్నారు.