GNTR: AP రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్ కింద జిల్లాలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.80.50 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 53 రోడ్ల పనులకు ఒకే ప్యాకేజీ కింద పంచాయతీరాజ్ శాఖ టెండర్లు ఆహ్వానించింది. ఈ నెల 29 సాయంత్రం 4.30 గంటల వరకు ఆన్లైన్లో బిడ్లు స్వీకరిస్తారు. ఈ పనులన్నింటినీ 18 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని ఎస్ఈ గువ్వల శ్రీనివాసులు నిబంధన విధించినట్లు తెలిపారు.