AKP: గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం పంచాయతీలో నిధుల దుర్వినియోగం కేసు కొత్త మలుపు తీసుకుంది. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పేరుతో దుర్వినియోగం చేసిన రూ.1,51,181ను పరారీలో ఉన్న సర్పంచ్ విజయలక్ష్మి కుటుంబ సభ్యులు పంచాయతీ ఖాతాకు జమ చేశారు. నగదు రసీదును ఎంపీడీవోకు అందజేశారు. ఈ ఘటనపై తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి.