ATP: నగరంలో మాంసం విక్రయ కేంద్రాలను తనిఖీ చేసిన ఏపీ మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాష్ నాయుడు విక్రేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో మాంసం విక్రయిస్తున్నట్లు గుర్తించిన పలు దుకాణాలకు జరిమానాలు విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ కుళ్ళిన మాంసం లేదా చనిపోయిన కోళ్లను విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు.