అన్నమయ్య: తిరుమల దర్శనం ముగించుకుని వెళ్తుండగా కలికిరి సమీపంలో ఇవాళ ఓమ్నీ వ్యాన్ టైరు పేలిపోవడంతో బోల్తా పడింది. కర్ణాటకకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు గాయపడగా, వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.