E.G: రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు గ్రామంలో యువగళం టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ పంపిణీ చేశారు. వేసవి నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.