సత్యసాయి: కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సోమవారం హిందూపురంలోని ప్రధాన తపాలా కార్యాలయాన్ని తనిఖీ చేశారు. పొదుపు పథకాలు, ఆధార్ నమోదు, పార్శిల్ సేవలపై అధికారులతో సమీక్షించారు. ‘సుకన్య సమృద్ధి’ వంటి పథకాలను ప్రజలకు చేరవ చేయాలని, ‘పీఎం విశ్వకర్మ’ పార్శిళ్లను సకాలంలో పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి పరిశుభ్రత పాటించాలని ఆయన సూచించారు.