VZM: గంజాయి రవాణా, విక్రయం, వినియోగానికి యువత దూరంగా ఉండాలని SP దామోదర్ గురువారం సూచించారు. (NDPS) చట్టం ప్రకారం గంజాయి కేసుల్లో పట్టుబడితే 20 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. గత 6 నెలల్లో జిల్లాలో 20 కేసులు నమోదు చేసి 85 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించామని పేర్కొన్నారు. అలాగే, సుమారు 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.