GNTR: NSUI 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు సంగడిగుంటలో ఇందిరా గాంధీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ NSUI కో-ఆర్డినేటర్ షేక్ కరీం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో NSUI జెండాను ఆవిష్కరించారు. శిబిరంలో కంటి, గుండె, దంత, జనరల్ వైద్య పరీక్షలతో పాటు ఈసీజీ, బీపీ, షుగర్, థైరాయిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.