ASR: జాయింట్ కలెక్టర్ శ్రీపూజ బుధవారం ముంచంగిపుట్టు మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. లబ్బూరు ఏకలవ్య మోడల్ రెషిడెన్సియల్ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. విద్యా బోధన, భోజన వసతులు, ఇతర సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం లబ్బూరు పీహెచ్సీ సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు