కోనసీమ: అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లో రెండు స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించిన రామచంద్రపురానికి చెందిన కారుమూరి లేఖా నిహారికను నటుడు శివాజీరాజా అభినందించారు. శుక్రవారం రాజమండ్రిలో ప్రశంసించారు. మార్చి 4 నుంచి బెంగళూరులో జరగనున్న సౌత్ జోన్ పోటీల్లోనూ నిహారిక తన ప్రతిభను చాటి మరిన్ని విజయాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.