CTR: వెదురు కుప్పం (M) పచ్చికాపల్లం గ్రామ పంచాయితీలో శుక్రవారం స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో పురుషోత్తం పాల్గొని గ్రామ ప్రజలు వారి ఇళ్లలోని నిరుపయోగ సామగ్రిని, చెత్తను ఇచ్చి ఇంటికి కావాల్సిన నిత్యావసరాలను అందజేయడంపై అవగాహన కల్పించారు. నిరుపయోగాన్ని వాడుకలోకి తేవడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.