TPT: చంద్రగిరిలో అన్న క్యాంటీన్ను ఇవాళ సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. రూ.61 లక్షల తుడా నిధులతో చంద్రగిరిలో అన్న క్యాంటీన్ నిర్మించారు. ఈ క్యాంటీన్లో ప్రతి రోజూ మధ్యాహ్నం 500 మందికి పైగా భోజన ఏర్పాట్లు చేయనున్నారు. అన్న క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా ఏర్పాట్లు శరవేగంగా నిర్వహిస్తున్నారు.