ASR: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతిని పురష్కరించుకుని అరకులోయలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. మంగళవారం అరకులోయ ఎన్టీఆర్ గ్రౌండ్ నుంచి వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు కోలాటం, దింసాలతో శోభాయాత్ర నిర్వహించారు. ఆధ్యాత్మిక వక్త రాధమనోహర్ దాస్ ముఖ్య అతిథిగా పాల్గొని హిందుత్వం, సనాతన ధర్మం ప్రాముఖ్యతను వినిపించారు. హిందూ బందువులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.